Big shock for Google employees.. Layoffs begin again

ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్‌ మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించింది ఓ ప్రముఖ కంపెనీ.

ఇక విషయంలోకి వెళ్తే..

ప్రపంచ టాప్ సెర్చింజిన్ గూగుల్.. తాజాగా మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దఫా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోనే కోత పెట్టింది. ఈ డివిజన్ లో దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ ఎదుర్కొన్న వాళ్లందరూ కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీళ్లలో క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ రీసెర్చి టీమ్, ప్లాట్‌ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్‌ బృందంలో సభ్యులు ఎక్కువగా ఉన్నారు. వీళ్లందరూ కూడా వినియోగదారుల తీరును డేటా, సర్వేలు, రీసెర్చి ఆధారంగా విశ్లేషించే విభాగాల్లో పనిచేసేవారే. వీళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే గూగుల్‌ ప్రొడక్ట్‌లను డిజైన్ చేస్తుంది. అంతేకాదు కొన్ని రకాల క్లౌడ్‌ డిజైన్‌ బృందాలను కూడా సగానికి పైగా తొలగించినట్లు సమాచారం. టెక్ రంగంలో చోటు చేసుకుంటోన్న భారీ మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గూగుల్ వివరించింది. వివిధ డివిజన్లను పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలిపింది.

ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్‌ మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించింది. ఐటీ రంగంలో చాలా కాలంగా లే ఆఫ్స్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఏఐ వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. అంతర్జాతీయ కంపెనీలు అన్ని కూడా ఈ ఏఐ కారణంగా.. ఉద్యోగాలు కొల్పోతున్నారు. ఇటీవలే TCS కంపెనీ దాదాపు 2% ఉద్యోగులను తొలగించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా.. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో అని సాఫ్టేవేర్‌ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. చిన్న చిన్న సంస్థలే కాదు.. దిగ్గజ ఐటీ సంస్థలు కూడా తమ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా CNBC నివేదిక ప్రకారం.. డిజైన్ సంబంధిత పాత్రల్లో 100 మందికి పైగా ఉద్యోగులను గూగుల్ తొలగించింది. అయితే తాజాగా గూగుల్‌లో ఉద్యోగాలు పోయినవాళ్లలో ఎక్కువగా అమెరికాకు చెందినవారే ఉన్నారు.

ఇక గత సెప్టెంబర్‌లో జెమినీ, ఏఐ ఓవర్‌ వ్యూ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లలో 200 మందికి పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గూగుల్‌ లేఆఫ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు.. ఉద్యోగ భద్రత, తక్కువ జీతం వంటివాటిపై ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉద్యోగులు వారు పనిచేసే విధానంపై మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇక 2025 ప్రారంభంలో కూడా క్లౌడ్‌ విభాగంలో పనిచేసే సిబ్బందిని గూగుల్ తొలగించింది. తమ బిజినెస్‌కు కీలక విభాగాలపై మాత్రమే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు అప్పట్లో గూగుల్‌ ప్రకటన చేసింది. అంతేకాదు గ్లోబల్ బిజినెస్, ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ డివిజన్‌లో కూడా తమ సిబ్బందిలో కొందరిని తొలగించింది. అలాగే హెచ్‌ఆర్ విభాగం, హార్డ్‌వేర్‌, సెర్చ్‌, యాడ్స్, ఫైనాన్స్‌, మార్కెటింగ్, కామర్స్‌ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వాలంటరీ ఎగ్జిట్‌ ప్యాకెజీని ప్రకటించింది గూగుల్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *