Tribal woman gang-raped

ఛీ… అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది. ఇంకెన్నాళ్లు ఈ మహిళలపై అత్యాచార ఘటనలు..? 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మహిళకు ఇంకా భద్రత లేదా…? దేశంలో అత్యాచార ఘటనలకు ఎన్ని శిక్షలు పడుతున్నా, ఇంకా ఈ మగ మృగాల్లో మార్పు రాదా..? నిర్భయ.. దిశ.. చట్టాలు ఏం చెబుతున్నాయి. గిరిజన మహిళలు అంటే చిన్న చూపా…? వాళ్లకు ఏం చేసినా ప్రభుత్వం అడగదని అహంకారమా..? ఏంటి ఈ అత్యాచారాలు.. ఇంకా మార్పు రాదా… అప్పుడెప్పుడో ఢిల్లీలో నిర్భయ, ఆ తర్వాత తెలంగాణలో దిశ, ఇక ఇటీవలే కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ రేప్ కేసు.. ఇలా ఇంకెన్నాళ్ళు, మగ మృగాలా కామానికి, మహిళలు బలి కావాల్సిందేనా.. ? తాజాగా నిర్భయ ఘటన మరోసారి రీపిట్ అయ్యింది.

మరో నిర్భయ…

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో నిర్భయ ఉదంతాన్ని తలదన్నే ఘటన జరిగింది. ఖాండ్వాలోని ఖాల్వా ఆదివాసీ ప్రాంతంలో గిరిజన మహిళ ప్రత్యక్ష నరకం అనుభవించింది. అక్కడి రోహిణి చౌక్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు పిల్లల తల్లినా గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేస్తూ.. చిత్రహింసలకు పాల్పడ్డారు. ఆమె ప్రవేట్ పార్ట్ లో ఇనుపరాడ్ జొప్పించి అమానుష రీతిలో హింసించారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ మరణించింది. ఖాండ్వాలో ఖల్వా పరిధిలోని రోష్నీ చౌకీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ దారుణమైన అత్యాచారం, హత్య జరిగింది.

తీవ్ర రక్తస్రావంతో…

ఘటన గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులకు అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళ చూసి గ్రామస్తులను విచారించారు. దీంతో గ్రామాస్తులు బాధిత మహిళ ఇద్దరు పిల్లల తల్లి అని పోలీసులు తెలిపారు. మహిళను ఆమె కూతురు పొరుగున ఉన్న ఇంట్లో అపస్మారక స్థితిలో గుర్తించారు. అత్యాచారం చేసిన వ్యక్తులు ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్ని చొప్పించి, ఆమె గర్భాశయాన్ని బయటకు తీశారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె చనిపోయింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితులను హరి పాల్వి, సునీల్ దుర్వేగా గుర్తించారు. వీరి ఇంట్లోని బాధితురాలి మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మహిళతో పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *