These are the special features of the 2025 Khairatabad Bada Ganesh

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారత దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ (Khairatabad) మహాగణపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఎక్కడ గణపతి (Ganesh) నవరాత్రులు జరిగిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ నవరాత్రులకు మాత్రం ప్రతి ఏడాది ప్రత్యేకమే అని చెప్పాలి.

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు…

తాజాగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ (Khairatabad Ganesh Festival Committee) మహాగణపతి (Mahaganapati) స్వరూపం నమూనాను విడుల చేశారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఈ ఏడాది శంకుస్థాపనగా కర్ర పూజ ఘనంగా నిర్వహించారు. నిర్జల ఏకాదశి రోజున జరిగే ఈ సంప్రదాయ కార్యక్రమంతో ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నెకి చెందిన శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి 150 మంది కళాకారులు ఈ నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఈ విగ్రహం విశ్వశాంతిని ప్రతిబింబిస్తూ అయోధ్య రామ్లల్లా విగ్రహం, శివపార్వతి, శ్రీనివాసుల కల్యాణ మండపం వంటి అదనపు ఆకర్షణలతో రూపొందుతోంది.

కర్ర పూజలో మొదలు…

శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ బడా గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఏడాది ఎదో ఒక కొత్త అవతారంతో భక్తులకు దర్శనం ఇస్తునే ఉన్నారు. తాజాగా శ్రీగణేష్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి (GaneshChaturthi2025) ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కర్ర పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. రెండు ఉత్సవ కమిటీల అధ్యక్షుడిగా దానం నాగేందర్ నేతృత్వంలో కర్ర పూజ జయప్రదంగా ముగిసింది. ఇందుకు సంబబంధించిన పోస్టర్ ను నగర మేయర్ విజయలక్ష్మి ఆవిష్కరించారు.

ఈ సారి ఎన్ని అడుగులంటే…?

ఇక ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నాడు. ఈసారి గణపతి రూపాన్ని శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా (Viswashanthi Mahashakti Ganapathi) రూపొందిస్తున్నారు. మహాగణపతికి కుడి వైపు శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడమవైపు లలిత త్రిపురసుందరి మరియు శ్రీ గజ్జలమ్మ దేవి కూడా కొలువై ఉంటారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు. భక్తులకు విశేషంగా ఆకర్షించే విధంగా రూపొందిస్తున్న ఈ గణేశ్ విగ్రహం నిర్మాణం త్వరలో ప్రారంభమవనుంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు ఉత్సవ కమిటీలు సిద్ధంగా ఉన్నాయి.

స్వాతంత్య్ర సమరయోధుడితో మొదలు…

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఎస్. శంకరయ్య స్థాపించిన ఈ ఉత్సవం ప్రస్తుతం ఆయన వారసుడు సింగరి రాజ్కుమార్ నేతృత్వంలో జరుగుతోంది. ఆగస్టు 26న ప్రారంభమై 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవం సెప్టెంబర్ 5న హుస్సేన్సాగర్లో నిమజ్జనంతో ముగియనుంది. రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం, ప్రత్యేక పూజలు, ఆరతులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. నిమజ్జన ఊరేగింపు ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా హుస్సేన్సాగర్ వరకు లక్షల మంది భక్తుల మధ్య జరిగి, సాగర్లో నిమజ్జనం అవడంతో ఉత్సవం ముగుస్తుంది.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *