Category: Global Indians
-

Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!
తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్న ఈ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని చెన్నై నగరంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగు చూసింది. ఇక విషయంలోకి వెళ్తే..…
-

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
-

Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?
ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్రిఫ్ సిరప్ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 15మంది పిల్లలు మరణించిన కేసులో పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.…
-

Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..
తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177…
-

Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?
Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్లోని భారత్కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.…
-

TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!
—
by
సాఫ్ట్వేర్ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్మెంట్పై ప్రభావం చూపుతుందని…
-

Vijayawada Indrakilaadri: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి..
దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. దర్శన క్యూలైన్లు కొండ కింద వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. నేడు విజయదశమి కావడంతో.. తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు…
-

Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!
నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి పుష్కరిణిలో చక్రస్నానం ఘనంగా నిర్వహించబడింది. శ్రీదేవి,…
-

EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..
Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ లక్ష్యం కోసం తక్షణమే రూ. 2,000 కోట్లను ఖర్చు చేయనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. పీఎం…
