Tag: IMD
-

Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు
Trains Cancelled : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు ట్రాక్లపై నీరు చేరడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి కారణాల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.…
-

Musi River : ఉగ్రరూపం దాల్చిన మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత.. బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్
Musi River : తెలుగు రాష్ట్రాలపై ‘మొంథా’ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఇక జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండాల తలపిస్తున్నాయి. ఇక ఈ భారీ తుఫాన్ కారణంగా.. జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద మూసీ నది పొంగిపొర్లుతుంది. మూసీ ఉదృతంగా ప్రవహించడంతో.. పోచంపల్లి- బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బీబీనగర్, భువనగిరికి వెళ్లే వాహనదారులు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది.…
-

AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ను తాకిన ‘మొంథా’ తుఫాను…
-

AP Heavy Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక జారీ..!
ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (Gusts) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Department…
-

Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తు ఆర్తనాదాలు చేస్తున్నారు.…
-

Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…
-

Heavy Rain | ఢిల్లీలో వర్షబీభత్సం.. బైక్పై చెట్టు కూలడంతో ఒకరు మృతి
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ తెల్లవారుజామున కురిసిన ఎడతెరిపి లేని కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ వర్షబీభత్సానికి కల్కాజీ (Kalkaji) ప్రాంతంలో ఓ బైక్పై భారీ చెట్టు కూలిపోయింది (tree crashes on bike). ఈ ప్రమాదంలో…
-

Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ (Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.…
-

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల…
