Tag: Heavy rains
-

Musi River : ఉగ్రరూపం దాల్చిన మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత.. బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్
Musi River : తెలుగు రాష్ట్రాలపై ‘మొంథా’ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఇక జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండాల తలపిస్తున్నాయి. ఇక ఈ భారీ తుఫాన్ కారణంగా.. జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద మూసీ నది పొంగిపొర్లుతుంది. మూసీ ఉదృతంగా ప్రవహించడంతో.. పోచంపల్లి- బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బీబీనగర్, భువనగిరికి వెళ్లే వాహనదారులు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది.…
-

AP Heavy Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక జారీ..!
ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (Gusts) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Department…
-

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
-

Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో చమోలీ జిల్లా నందానగర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ భారీ వదలకు నందానగర్ లో 10 మంది గల్లంతయ్యారు. దాంతో పాటూ చాలా ఇళ్ళు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. దాదాపు ఆరు భవనాలు శిథిలావస్థకు…
-

Himachal Pradesh : డేంజర్ లో హిమాచల్ ప్రదేశ్.. కుల్లు-మనాలిలో వరద భీబత్సం
హిమాచల్ ప్రదేశ్ పై మళ్లీ ప్రకృతి ప్రకోపాన్ని చూపించింది. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల వల్ల కిరాట్పూర్-మనాలీ జాతీయ హైవేపై నష్టం జరిగింది. దీంతో మండీ, మనాలీ లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల .. బియాస్ నది ఉగ్రరూరపం దాల్చింది. దాని ఉప నదులు సైతం ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఎమర్జెన్సీ చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారి పలు ప్రదేశాల్లో బ్లాక్ అయ్యింది. దీంతో…
-

Manjeera Dam : డేంజర్ లో మంజీరా డ్యాం.. గేట్ల పైనుంచి వరద
తెలంగాణలో గత కొంత కాలంగా.. ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు ప్రమాదపు జాబితాలో చేరింది. అదేదో కాదు.. మంజీరా ప్రాజెక్టు. అవును ప్రస్తుతం మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపోయింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీర బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్దమొత్తంలో ఉండడంతో…
-

Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…
-

Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం
గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఎగువ నుంచి రావడంతో.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) పూర్తిగా…

