గుజరాత్ లో ఘోర ప్రమాదం…

గుజరాత్ (Gujarat) లో ఘోర విమాన ప్రమాదం (Flight Accident) సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ వద్ద క్రాష్ ల్యాండింగ్ (Crash landing) అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ విమానంలో బీజేపీ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం.
టేకాఫ్ అయిన 2 నిమిషాలకే…

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్ఇండియా విమానం కూలిపోయింది. సివిల్ ఆస్పత్రి సమీపంలో విమానం చెట్టును ఢీకొట్టిన అనంతరం జనావాసాలపై కూలింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. అంబులెన్స్లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఫైట్ లో… 242 మంది…

అహ్మదాబాద్ (Ahmedabad) నుండి లండన్ కు 242 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ అయిందని తెలుస్తోంది. కొన్ని బిల్డింగ్ లపై విమానం క్రాష్ లాండ్ అయిందని తెలుస్తోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ, పోలీసు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా…

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం అది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సమాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడాని వినియోగించారు.
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా…

ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు. ఇదే విమానంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ ఉన్నట్లు సమాచారం ఆయనతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు ఉన్నట్లు సమాచారం.
Suresh