ఆఫ్రికా దేశంలో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. నైజీరియా లోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మిగిలయ్యారు. కాగా, వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు.
నైజీరియాలో కొట్టుకుపోయిన డ్యామ్…
ఆఫ్రికా దేశం నైజీరియా ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నైజర్ రాష్ట్రంలోని నైజర్ నది ఒడ్డున ఉన్న మోక్వా పట్టణంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ఓ డ్యామ్ కూలిపోయింది. దీంతో వరద ఆ పట్టాణాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 111 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన అధికారులు మోక్వా పట్టణంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇక భారీ వర్షాలకు, వరదలకు దాదాపు 115 మంది మృత్యువాత చెందారు. అక్కడి ప్రభుత్వం…దాదాపు 115 కు పైగా మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చని అక్కడి అధికారులు తెలిపారు. ఇంకా వందలాది మంది కనిపించకుండా పోయారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తు్న్నాయని చెప్పారు. కాగా 2022లో ఆ దేశంలో వచ్చిన వరదలకు 14 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 600 మంది చనిపోయారు. వాతావరణ మార్పుల కారణంగానే నైజీరియా తరచుగా తీవ్ర వరదలను ఎదుర్కొంటోందని, స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదై భారీ నష్టాన్ని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలు కూడా అదే కోవలోకి వస్తాయని, ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఊహించని స్థాయిలో వరదలు సంభవించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టినా, నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధారణ పరిస్థితి నెలకొనడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
గతంలోనూ ఇదే తరహాలో ప్రకృతి ప్రళయం
గత సెప్టెంబరులో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో కుండపోత వర్షాలు కురవడంతో పలు చోట్ల ఇళ్లు, వంతెనలు, ఆనకట్టలు కూలిపోవడం సంభవించింది. ప్రస్తుతం నైజీరియాలో భారీ వరదలకు కొట్టుకుపోయిన డ్యాం కరణంగా… మృతుల సంఖ్య మరింత అవకాశం ఉంది అని.. ప్రభుత్వం అంచనావేస్తుంది. నైజీరియాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వరదలకు అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రహదారులు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వ సహాయ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. భావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత సెప్టెంబరులో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈశాన్య నైజీరియాలోని మైదుగురిలో కుండపోత వర్షాలు కురవడంతో పలు చోట్ల ఇళ్లు, వంతెనలు, ఆనకట్టలు కూలిపోవడం సంభవించింది. అప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. బాధితులకు సాయం చేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగారు. జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ (NEMA) దీనిని జాతీయ విపత్తుగా గుర్తించాలని అక్కడి ప్రభుత్వం కోరుతోంది.
SURESH