అమెరికాలో ఏం జరుగుతోంది. అందరూ అనుకున్నట్లు ట్రంప్ – ఎలాన్ మస్క్ మధ్య వివాదం తలెత్తిందా..? ప్రపంచ పెద్దన్న, ప్రపంచ కుబేరుడు మధ్య గ్యాప్ ఏర్పడిందా..? ఎప్పటి నుంచో ట్రంప్ తీసుకునే నిర్ణయంపై మస్క్ అసంతృప్తిలో ఉన్న మాట నిజమేనా..?ట్రంప్ పాలన వర్గం నుంచి ఒక్కొక్కరిగా తప్పుకోవడానికి కారణం ట్రంప్ నిర్ణయాలేనా..? ట్రంప్ ఆలోచనలకు, మస్క్ ఆలోచనలకు పొసగడం లేదా..?
అందరు అనుకున్నదే జరిగిందా…?
అందరు అనుకున్నదే జరిగింది.. అదే జరుగుతుంది కూడా… అవును ట్రంప్ పాలకవర్గం నుంచి ఒక్కోక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. గత కొంత కాలంగా… అగ్ర రాజ్యం పెద్దన్న ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా పాలకవర్గం అయిన డోజ్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు మస్క్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిన మాధ్యమం ఎక్స్లో ప్రకటన చేశారు. ‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది’ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
ట్రంప్, మస్క్ మధ్య గ్యాప్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మధ్య గ్యాప్ వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్.. ట్రంప్ కు సపోర్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ బ్రెయిన్ ఛైల్డ్ గా చెప్పుకునే ఈ బిగ్, బ్యూటిఫుల్ బిల్లును రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆమోదం పొందింది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ దీన్ని ఆమోదించింది. ఒకే ఒక్క ఓటు తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ అండ్ బ్యూటిపుల్ బిల్లుపై స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ తీసుకొచ్చిన బిల్లను ఆయన బహిరంగంగానే వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది.
ట్రంప్ ఆలోచనలకు, మస్క్ ఆలోచనలకు పొసగడం లేదా..
దీంతో మస్క్ ,ట్రంప్ మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ బిల్లుకు అధికంగా ధనం ఖర్చు చేయడం తనకు అసంతృప్తిని కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ ను మిగులుస్తుందని తెలిపారు మస్క్. మరోవైపు మస్క్ సైతం డోజ్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అమెరికాలో లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే గత కొంత కాలంగా మస్క్ కంపెనీలు భారీగా నష్టాలను చూస్తున్నాయి. దీంతో డోజ్ నుంచి వైదొలిగి వ్యాపారంపై దృష్టి పెట్టాలని మస్క్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.ట్రంప్ అధికారంలోకి రాగానే… ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు ట్రంప్ డోజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలాన్ మస్క్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలోని వృథా ఖర్చులు తగ్గించడం, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడమే డోజ్ చేసే పని. అయితే ట్రంప్ సర్కార్ ఏర్పడిన కొత్తలో బాగానే పనిచేసింది డోజ్ వ్యవస్థ. ఆ తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు ఏకపక్ష నిర్ణయాలతో డోజ్ వ్యవస్థ నుంచి మస్క్ దూరం జరిగారు. మస్క్ దూరాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు.
నేను వచ్చిన పని అయిపోయింది…
ఇక మస్క్ ట్రంప్ పాలక వర్గంలో చేరినప్పటి నుంచి… డోజ్ ద్వారా ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించామని.. కాబట్టి తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెప్పుకోచ్చారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటును సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు 4బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేశామని మస్క్ చెప్పుకొచ్చారు. ఇక DOGE మే 2025లోపు దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకమని చెప్పారు. అందుకే DOGE ను వదిలేసానని అన్నారు. అంతకు ముందు తమ డీవోజీఈ సిబ్బంది వారానికి 120 గంటలు పనిచేస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.