అంతా దైవేచ్ఛ…
భగవద్గీత… యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గ్రంథం. భగవద్గీత అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం. మానవ జీవిత సారాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు గీతాసారం ద్వారా చెప్పాడని ప్రతీతి. అందుకే ఈ పుస్తకాన్ని అందరూ చదువుతారు. భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ఈ పుస్తకాని చదివి వాటి సారాంశాన్ని పలు మార్లు వెల్లడించారు కూడా. ఇక మరోవైపు భారత దేశ వ్యాప్తంగా… కోర్టులో కూడా భగవద్గీతపై ప్రమాణం చేసి.. విచారణ జరిపిస్తాం. ఇంత పవిత్రమైన భగవద్గీత సొంతం. కాగా ఇప్పుడు ఈ గ్రంథం గురించి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతగా ఈ వీడియోలో ఏముంది అంటారా.. అయితే ఆగండి అక్కడికే వస్తున్నా…
ఇటీవలే గుజరాత్ లోని అహ్మాదాబాద్ ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. విమానం కుప్పకూలిన వెంటనే బాంబు పేలినట్లుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో పడి చాలా మంది కాలి బూడిద అయిపోయారు. ఈ ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కొల్పోగా…. పరిసర ప్రాంతాల వాళ్లు కలిపి 265 మందికి పైగా ఉన్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఉందులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో యాదృచ్ఛికమో లేక దేవుడి లీలనో తెలీదు కానీ, ప్రమాదం జరిగిన చోట.. విమాన శకలాల దగ్గర అద్భుతమైన విషయం బయటపడింది. ప్రస్తుతం ఆ వీడియోనో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవత్ గీత మాత్రం చెక్కు చెదర్లేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవత్గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో.. ఒక వ్యక్తి ప్రమాదం జరిగిన ఘటన వద్దకు వెళ్లాడు. అక్కడ అతడికి పవిత్ర గ్రంథమైన భగవద్గీత దొరికింది. దాన్ని పైకి లేపి ఒక్కో పేజీ ఓపెన్ చేశాడు. కానీ అందులో ఏ ఒక్క పేజీ కూడా కాలిపోయినట్లు కనబడలేదు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. అంతా బుగ్గి అయిపోగా.. భగవద్గీత మాత్రం అలాగే ఉంది. చెక్కు చెదరలేదు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దాని ఫొటోలు చూసి, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదెలా సాధ్యమైంది అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విమాన ప్రమాదంలో మృతదేహలు నూనెలో కాల్చినట్లు ఉన్నాయి. అక్కడి దృశ్యాలు చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే. ఇక ఆ ప్రదేశంలో… మృతదేహాలను గుర్తించడం, తరలించడం వంటివి జరుగుతున్నాయి. అలాంటి చోట.. ఈ భగవద్గీత గ్రంథం లభించింది. అందులో పేజీలన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. లోపల ఒక్క పేజీ కూడా దెబ్బ తినలేదు. ఇక ఈ గ్రంధం ఇక్కడికి ఎలా వచ్చిందని ఆరా తీస్తే… విమానంలోని ఒక ప్రయాణికుడి దగ్గర ఈ భగవద్గీత గ్రంథం ఉండేదని తెలిసింది. ఐతే.. విమానం పేలినప్పుడు తీవ్రమైన అగ్ని వచ్చినా.. ఈ పుస్తకం కాలకుండా, ఏమాత్రం పాడవకుండా ఉండటం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతా దైవ మాయ అంటున్నారు. లేదంటే అన్నీ కాలిపోయినప్పుడు.. ఈ పుస్తకం మాత్రం ఎందుకు కాలలేదో చెప్పాలని సవాల్ విసురుతున్నారు.
Suresh