Floods in the Northeast… Heavy rain breaks 132-year record
  • ఈశాన్యంలో జలవిలయం..
  • అస్సాం సిల్చార్‌లో 132 ఏళ్ల రికార్డు బద్దలు..!
  • చిగురుటాకులా వణుకుతున్న ఈశాన్య రాష్ట్రాలు
  • భారీ వర్షాలకు కొండచరియలు విరిగి 34 మంది బలి
  • మిజోరంలో సాధారణం కన్నా 1102 శాతం అధిక వర్షపాతం
  • మేఘాలయలోని చిరపుంజి, మాసిన్రామ్‌లలో భారీ వరద
  • త్రిపుర, మణిపూర్‌లలో స్తంభించిన జనజీవనం…
  • 3 వేలకు పైగా దెబ్బతిన్న ఇళ్లు
  • 60,000 వేల మందికి పైగా బాధితులు

గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు ( Heavy rains) అక్కడి ప్రజలను బయం బ్రాంతులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాలకు అస్సాంలో భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాకతో ఈశాన్య భారతదేశం అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతాల్లో వరదలు సంభవించి, కొండచరియలు విరిగిపడి 24 గంటల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Also : Cricketer Retirement : క్రికెట్ ఫ్యాన్స్ కి హాట్ బ్రేకింగ్ న్యూస్… ఇద్దరు స్టార్ క్రికెటర్స్ రిటైర్మెంట్

ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య భారతంలో జూన్ నెల ఆరంభంలోనే వరుణుడు ప్రతాపం చూపించాడు. అస్సాం, మణిపూర్, త్రిపుర సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించింది. అస్సాం (Assam) లోని రెండో అతిపెద్ద నగరమైన సిల్చార్‌లో జూన్ 1న ఏకంగా 132 ఏళ్లనాటి వర్షపాతం రికార్డు బద్దలైంది. ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత మూడు రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాల కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మూడు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండగా, ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

132 ఏళ్ల రికార్డు బద్దలు..!

అస్సాంలోని (Assam Floods) సిల్చార్ నగరం నిన్న కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. కేవలం 24 గంటల వ్యవధిలో 415.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒకే రోజులో నమోదైన అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. 1893లో నమోదైన 290.3 మిల్లీమీటర్ల వర్షపాత రికార్డును తాజా వర్షం తిరగరాసింది. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణుల కలయిక వల్లే ఈ అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) (IMD) వెల్లడించింది. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా మధ్య అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు తీవ్రమైన వాతావరణ కల్లోలం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

దీంతో వాతావరణ శాఖ (Department of Meteorology) అలెర్ట్ అయ్యి… అసోంలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మిగిలిన ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలతో పాటు ఉత్తర బంగ్లాదేశ్- షిల్లాంగ్ సమీపంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు తీవ్రరూపం దాల్చినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also : Elon Musk : డోజ్ నుంచి మస్క్ తప్పుకున్నాడా…? గెంటేశారా..?

ఈ మూడు రాష్ట్రాల్లో కుంభవృష్టి…

గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం(Assam), మణిపూర్ (Manipur), త్రిపుర (Tripura), సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు (landslides) విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. మిజోరంలో మే 31న సాధారణం కంటే ఏకంగా 1102 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మేఘాలయలో మే 28 నుంచి జూన్ 1 వరకు ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోహ్రా (చిరపుంజి), మాసిన్రామ్‌లలో వరుసగా 796 మి.మీ., 774.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ఖ్లీహ్రియాత్, RKM సోహ్రా, పైనూర్స్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా 500 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. మే 30న ఆర్‌కేఎం సోహ్రాలో ఒక్కరోజే అత్యధికంగా 378.4 మి.మీ. వర్షం పడగా, మొత్తం ఐదు రోజుల్లో అక్కడ 993.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అలాగే మాసిన్రామ్, పైనూర్స్లాలలో కూడా మే 30న ఒక్కరోజే 250 మి.మీ.కు పైగా వర్షం కురిసింది. మేఘాలయలోని 10 జిల్లాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి.

ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు అయిన అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం (Mizoram), అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే… ఈ రాష్ట్రాలన్ని కూడా దేశంలోనే భారీ వర్షాలు నమోదైయ్యా రాష్ట్రాలుగా రికార్డు ఉంది. ఇక ఈ భారీ వర్షాల దాటికి పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. అసోంలో కొండచరియలు విరిగిపడి ఇప్పటికి ఐదుగురు మృతి చెందారు.

దాదాపు 10,000 పైగా…

ఇక త్రిపురలో ఆకస్మిక వరదల కారణంగా 10,000 మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మణిపూర్‌లో ప్రధాన నదులు ఉప్పొంగడం, కట్టలు తెగిపోవడంతో వరదలు సంభవించి, 19,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. సుమారు 3,365 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే… అరుణాచల్ ప్రదేశ్, అసోంలోనే ఇప్పటి దాకా దాదాపు 14 మంది మృతి చెందారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాలు ఈ విపత్తుతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అసోంలోని 12 జిల్లాల్లో 60,000 మందికి పైగా ప్రజలు వరదలకు ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌ లోని ఈస్ట్ కామెంగ్ జిల్లాలో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బనా-సెప్పా మార్గంలోని NH-13 రూట్ లో ప్రయాణించే వాహనం లోయలో పడిపోవడంతో మృతి చెందారు. ప్రస్తుతం ఈ భారీ వర్షాలకు ముఖ్యంగా 3 రాష్ట్రాలు డేంజర్ జోన్ ఉన్నాయి. దీంతో కేంద్ర హోంమంత్రి మూడు రాష్ట్రాల సీఎంలతో, గవర్నర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి విపత్తుపై సమీక్షా నిర్వహించారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *