Drought ranges in Pakistan... A series of letters to India asking for water
  • పాకిస్తాన్ లో కరువు తాండవం…
  • మోడీ దెబ్బకు పాక్ విలవిల…
  • సింధు జలాలు లేక పాక్ ఉక్కిరి బిక్కిరి…
  • పాక్ లో ఎండిపోతున్న లక్షలాది ఎకరాలు…
  • సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ అల్లల్లాడుతోంది.

పాకిస్థాన్ (Pakistan) లో ప్రస్తుతం కరువు దిశగా అడుగులు పడుతున్నాయి. సింధు నదీ జలాల రద్దుతో పాక్ లో ఇప్పుడు కరువు తాండవం చేస్తుంది. భారత్ – పాక్ (India – Pakistan) మధ్య దౌద్యపరమైన సంబంధాలు (Diplomatic relations) తెగిపోవడంతో పాక్ కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది.

సింధు జలాల ఒప్పందం…

సింధు జలాల (Indus waters) ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ (India) తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ నీటిని కట్టడి చేస్తే తమకు తీవ్ర నీటి ఎద్దడి తప్పదన్న ఆందోళనలో ఉన్న దాయాది దేశం.. ఒప్పందంపై పునరాలోచన చేయాలంటూ పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. ఈ అంశంపై పాకిస్తాన్ ఇప్పటివరకూ నాలుగు లేఖలు రాసిందని కేంద్ర ప్రభుత్వ (Central Govt) వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 22న పహల్గాం (Pahalgam)ఉగ్రదాడి (terror attack) తర్వాత పాక్ తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రకటించడంతో పాక్ కు టెన్షన్ మొదలైంది. కరువు (drought) కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఈ విషయంలో భారత్ ను బతిమాలుతోంది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పదేపదే అడుగుతుంది. దీనికి సంబంధించి నాలుగు లెటర్స్ ను రాసింది. అంతటితో ఆగకుండా… చైనాతో కలిసి భారత్ ను బెదిరించే ప్రత్యామ్నాయం సైతం మొదలుపెట్టింది.

పాక్ నోటి దురుసు…

భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ (Pakistan) కు నీళ్లు ఆపేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దిగువకు నీళ్లు వెళ్లకుండా ఆపేసింది. మా నీళ్లు ఎవరూ ఆపలేరని ఈ ఒప్పందాన్ని రద్దు చేసినపుడు పాకిస్తాన్ లోని రాజకీయ నేతలు, ఆర్మీ అధికారులు పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ( Pakistan Government) వరుసగా లేఖలు రాస్తోంది. దాహం వేస్తోంది. మంచినీళ్లు ఇవ్వండి ప్లీజ్ అంటోంది. మిత్రుడు చైనాతో కలిసి బెదిరింపులకు పాల్పడుతోంది. బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. చైనా కూడా ఆ బెదిరింపులకు మద్దతు పలుకుతోంది. తాము బ్రహ్మపుత్ర నదిని ఆపేస్తామని అంటోంది. ఇప్పటికే ఆ నదిని ఆపడానికి చైనా చేయాల్సినదంతా చేస్తోంది. భూటాన్ వద్ద అతి పెద్ద డ్యాం నిర్మిస్తోంది. కొత్తగా చైనా ఆపేదేం లేదు. బ్రహ్మపుత్ర నదిని చైనా ఆపేసినా.. సమస్యలు రాకుండా చూసుకునేలా భారత్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అందుకే ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల సీఎంలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు.

పాక్ తో యుద్ధం ఆగిపోయిందా…?

నిజానికి పాకిస్తాన్ తో యుద్ధం (war) ఆగిపోయింది అని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. ఇటీవలే… కేంద్ర ప్రభుత్వ పెద్దలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో కలసిపోతుంది ప్రకటిస్తున్నారు. యుద్ధం ఆపేశారు కదా ఎలా సాధ్యమని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బుల్లెట్లు, బాంబులు, మిస్సైళ్లతో జరిగే యుద్ధమే ఆగిపోయింది. పాకిస్తాన్ పై అసలైన యుద్ధం కొనసాగుతోంది. ఆ యుద్ధంలో ఓడించి.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (Pakistan-occupied Kashmir) ను స్వాధీనం చేసుకుంటారు. ఆ యుద్ధంలో అసలైన బాంబు నీళ్లే. సింధూ జలాలు కావాలంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (Kashmir) ను భారత్ కు అప్పగించి అక్కడ ఉగ్రవాదం లేకుండా చేస్తేనే పాకిస్తాన్‌కు నీళ్లు అందుతాయి. లేకపోతే పాకిస్థాన్ సగం ఎడారి అయిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ విడిపోయింది. ఆ ప్రాంతాల్లోని ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేస్తారు. అంటే ఇక్కడ భారత్ వ్యూహం ఏంటి అంటే… కర్ర విరగకూడదు కానీ పాము మాత్రం చావాలి అనేది భారత్ వ్యూహం. దీంతో పాక్ ప్రజల చేత పాకిస్థాన్ లో నీటి విప్లవం తేవడమే భారత్ అసలైన లక్ష్యం. ఇప్పుడు కాకపోయినా భవిషత్యులో మాత్రం POK ని స్వాధీనం చేసుకోని పాక్ కు నీళ్లు ఇచ్చే రోజు కోసం భారత్ అడుగులు వేస్తున్నారు.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *