Did Tollywood star heroes Ram Charan, Prabhas, and NTR receive the Gaddar Award?

తెలంగాణలో ప్రస్తుతం అవార్డుల పండుగ నడుస్తుంది. తెలంగాణ సర్కార్ ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ సినీ అవార్డ్స్ ప్రకటించింది. తాజాగా ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రానికి ఎంపికయ్యారు. అదే విధంగా గతం లో ఆయన హీరో గా నటించిన ‘అలా వైకుంఠపురంలో’, అదే విధంగా సపోర్టింగ్ రోల్ చేసిన ‘రుద్రమదేవి’ చిత్రాలకు కూడా అవార్డ్స్ దక్కాయి. కానీ గ్లోబల్ లెవల్ లో తెలుగోలి సత్తా చాటి అవార్డులు అందుకు ముగ్గురు హీరోలకు మాత్రం ఒక్క అవార్డు సైతం అందుకోలే

రేవంత్ సర్కర్ పై ఆ హీరోల నేతలు ఆగ్రహం…

తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్టాత్మకమైన గాద్ద‌ర్ అవార్డ్స్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచే ఆ అవార్డులను అఫీషియల్‌గా ప్రకటించింది. 2024వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలకు.. అందులో నటించిన నటీనటులకు తాజాగా ఈ అవార్డ్స్ ను ప్రకటించారు. ఇందులో భాగంగానే 2014 నుంచి 2023 వరకు రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి ఉత్తమ సినిమాల అవార్డ్స్ ను అందజేయనున్నారు. అయితే.. ప్రకటించిన ఈ అవార్డులో హైయెస్ట్ అవార్డులు అల్లు అర్జున్ సినిమాలకే ఉండడం చర్చనీయాంసంగా మారింది. ఉత్తమ నటుడు క్యాటగిరీలో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను సెలెక్ట్ చేశారు. దీంతో పాటు… గతంలో ఆయన హీరోగా నటించిన అలవైకుంఠపురం మూవీ సపోర్టింగ్ రోల్‌లో రుద్రమదేవి సినిమాలకు కూడా అవార్డులు అనౌన్స్ చేశారు.అయితే… ప్రస్తుతం ఈ అవార్డ్స్ విషయంలో ఇతర స్టార్ హీరోల అభిమానుల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ లిస్టులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు అసలు ప్లేస్ దక్కకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు. వీళ్ళు చేసిన సినిమాలేవి మీకు కనిపించలేదా.. వాటికి ఒక్క అవార్డు కూడా ఎందుకు రాలేదు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో అయినా ఈ స్టార్ హీరోల సినిమాలను గుర్తించి అవార్డులు ఇవ్వకపోతే మీరు చేసింది పెద్ద తప్పిదమే అవుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఇవీ మంచి సినిమాలు కావా..?

గతంలో ఈ ముగ్గురు చేసిన సినిమాలు అద్భుతం అనే చెప్పాలి. ప్రభాస్ నటించిన బాహుబలి 1, బాహుబలి 2 గాని, రామ్ చరణ్ నటించిన RRR, ఎన్టీఆర్ నటించిన దేవర వంటి సినిమాలకు ఒక్క అవార్డు అంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. అంటే వీళ్లు నట తెలంగాణ ప్రభుత్వం సినిమా హీరోలకు కనిపించల లేదా.. ? వీళ్లు తెలంగాణ గద్దర్ అవార్డులకు అర్హులు కాదా అంటూ ఫ్యాన్స్, సినిమా ప్రేమికులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 2018 లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం లో ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనవసరం లేదు అప్పట్లో విమర్శకులతో సైతం ప్రశంసలు దక్కించుకున్నాడు గ్లోబల్ స్టార్ చరణ్. ఒక మాటలో చెప్పాలంటే.. గడిచిన దశాబ్ద కాలంలో నటనతో ఈ రేంజ్‌లో స‌త్త చాటుకున్న‌ నటుడు మరెవరు ఉండరేమో.. ఈ సినిమాలో ఆయన నటనకు నేషనల్ అవార్డు దక్కిన ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ.. వాళ్లు ప్రయత్నించలేదు. అలాంటి చరణ్‌ని గాద్ద‌ర అవార్డ్స్‌లో 2018 సంవత్సరంకు ఉత్తమ నటుడు కేటగిరీలో ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ అభిమానులు మండిపడుతున్నారు. అలాగే.. తెలుగు సినీ ఇండస్ట్రీని యావత్ సినీ ప్రపంచానికి మన సత్తా చాటి చెప్పిన బాహులి 1, బాహుబలి 2 లో ప్రభాస్ న‌ట‌న ఎంత‌లా ఆకట్టుకుందో తెలిసిందే.

ప్రపంచంలో గెలిచిన వాళ్లు, సొంత ఊర్లో ఓడిపోయారా..?

అసలు ప్రభాస్ లేని బాహుబలి క్యారెక్టర్ ని అసలు ఊహించుకో గలుగుతారా..? నిజానికి ఆ పాత్రకే వన్నె తెచ్చిన అంత గొప్ప నటుడు ప్రభాస్. మన దరిద్రం ఏంటి అంటే… ఆ పాత్రకు అంతటి వన్నె తెచ్చిన అలాంటి గొప్ప నటనకి పాపం ఇప్పటి వరకు ఒక్క పురస్కారం కూడా దక్కలేదు. ఫిలింఫేర్, సైమా, IIFA ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఉన్నాయి. కానీ వాటిల్లో ప్రభాస్ కి ‘బాహుబలి 2’ లో అద్భుతంగా నటించినందుకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. బయటవాళ్ళు ఎలాగో గుర్తించలేదు, కనీసం ప్రభుత్వం తరుపున అయినా గుర్తించాలి కధా.. మన హీరోలకు మన అవార్డులు ఇవ్వకపోతే ఇంకేవ్వరు ఇస్తారు. అదేం న్యాయం అని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ అయితే టెంపర్ నుండి దేవర వరకు వరుసగా 7 సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. ఈ 7 సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు కూడా అవార్డు ఇవ్వలేదు. నిజానికి ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు నేషనల్ అవార్డే రావాలి. మన మనవాళ్లు అది గుర్తించరు. ఆయన నటించిన 7 సినిమాల్లో ఒక్క సినిమా కూడా అవార్డుకు నోచుకోలేదా..? సమాజానికి అంత దరిద్రగా ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయా..? కనీసం మన ప్రభుత్వం మన వాళ్లను గౌరవించి.. వాళ్ళ నటనను గుర్తించకపోతే ఇంకెందుకు ఈ అవార్డులు అంటూ మండిపడుతున్నారు. మన వాళ్ల టాలెంట్ ని మనం గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు. ఎందుకు ప్రభుత్వం ఈ పక్షపాత వైకరిని ప్రధర్సిస్తుంది.

NTR కి ఎప్పుడో అవార్డు ఇవ్వాల్సింది…

ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద భారీ డైలాగులు అయినా అలవోకగా చెప్పగల తారక్.. ఎలాంటి పాత్ర అయ్యిన అల‌వోక‌గా మెప్పించ‌గ‌ల‌డు. ఆయన లాగా డైలాగ్ చెప్పే నటుడు టాలీవుడ్ లోనే కాదు, యావత్ ఇండియాలో ఎవరు లేరు అనే చెప్పాలి. రాష్ట్రం ఆపదలో ఉంటే, లేదంటే ఏదైనా విపత్తు సంభవిస్తే, రాష్ట్రాలకు విరాళం ఇచ్చేందుకు అందరి కంటే ముందుగా ఈ ముగ్గురు హీరోలే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనకే కాదు, దక్షిణాదిలో కూడా ఏ విపత్తు వచ్చిన మన వాళ్లు ముందుగా స్పందించి ఏదోలా సాయం చేసేందుకు ముందుకు వస్తుంటారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం స్పందిస్తున్న వైకరి మాత్రం, పక్షపాత వైకరే అని చెప్పాలి. ఇంతటి సమాజ సేవ చేసే హీరోలకు ఎందుకు అవార్డులు ఇవ్వడం లేదో, ఎందుకు వాళ్లను ప్రభుత్వం తరఫున గౌరవించడం లేదో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కచ్చితంగా ఎన్టీఆర్, చరణ్, తారక్ ల‌కు అవార్డులు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా లిస్టులో ఈ ముగ్గురు హీరోలను చేరుస్తుందో లేదో వేచి చూడాలి.

SURESH

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *