Ola, Rapido, Uber బిగ్ షాక్…

- ఈ క్యాబ్ సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం…
- అడ్వాన్స్ టిప్ ఇవ్వాలని… Ola, Rapido, Uber సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయా..?
- క్యాబ్ సర్వీసులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారా..?
- అడ్వాన్స్ టిప్ అంటే ఏంటి…? అది ఎలా మొదలైంది..?
- వేగవంతమైన సేవ కోసం ప్రయాణికుల నుంచి ‘అడ్వాన్స్ టిప్’ వసులు చేస్తుందా..?
- ఈ మూడు సర్వీసులపై CCPA ఎందుకంతా సీరియస్ అవుతుంది..?
- నిజంగా క్యాబ్ సర్వీసులు ప్రజల నుంచి నగదు దోపిడి చేస్తుందా..?
- కేంద్ర నోటిసులపై… ఆ కంపెనీలు ఏం చెబుతున్నాయి…?
మీరు ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్లాలా.. అయితే చిటికెలో మీ చేతిలో ఉన్న ఫోన్ నుంచి క్యాబ్ బబుక్ చేసుకోండి. మీరు ఒక్కరైతే బైక్ సర్వీసులతో మీ గమ్యాన్ని చేరుకోండి. Ola, Rapido, Uber వంటి సర్వీసులతో ప్రయాణికుల సమయాన్ని తగ్గించి, తగినంత నగదు చెల్లించి మీ గమ్యాన్ని చేరుకోవచ్చు. కాగా తాజాగా Ola, Rapido, Uber సంవత్థలకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే…
దేశంలో క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా (Ola), ర్యాపిడో (Rapido), ఉబర్ (Uber) వంటి సంస్థల తీరుపై వినియోగదారులలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇటీవల సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ‘అడ్వాన్స్ టిప్’ విధానంపై స్పందించిన నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా వినియోగదారులు తమ గళాన్ని విప్పుతున్నారు. ఈ విధానాన్ని ‘దారి దోపిడీ’గా అభివర్ణిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకని అంత పెద్ద మాటలు కేంద్ర ప్రభుత్వం వాడాల్సి వచ్చింది. అంతగా ఈ సంస్థలు ఏం చేశాయి. ప్రయాణికులతో ఏమైనా దంత వసులు చేస్తుందా..? అనే అనుమానాలకు దారి తీస్తుంది. మరి ఏంటి ఆ దోపిడి, అనేది ఇప్పుడు చూద్దాం రండి.
CCPA ఆగ్రహం…
తాజాగా Ola, Rapido, Uber సర్వీస్ తీరును కేంద్ర ప్రభుత్వం CCPA తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాస్తవానికి మీకు అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే… ‘డ్రైవర్కు ముందుగానే టిప్ ఇస్తే త్వరగా పికప్ చేసుకుంటారు’ అనే ఆప్షన్ కనిపిస్తే..? ఇదే ఇప్పుడు ఉబెర్, రాపిడో వంటి ప్రముఖ రైడ్-హెయిలింగ్ యాప్లలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ ‘అడ్వాన్స్ టిప్పింగ్’ విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. “వేగవంతమైన పికప్ కోసం టిప్ జోడించండి” అంటూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్న ఈ విధానం నైతికంగా సరికాదని, ఇది క్యాబ్ల కోసం వేలంపాటను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ ఇటీవలే ఉబెర్కు CCPA నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ లో క్యాబ్ బుక్ చేస్తే ఓలా, ఉబర్, ర్యాపిడోలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయా.. రైడ్ మొదలయ్యే ముందే డ్రైవరికి టిప్ ఇవ్వాలని ఈ కంపెనీలు ప్రయాణీకులపై ఒత్తిడి చేస్తున్నాయా.. టిప్ ఇవ్వకపోతే లేదా తక్కువ ఇస్తే డ్రైవర్లు రైడ్ని క్యాన్సిల్ చేస్తున్నారా.. ఈ అడ్వాన్స్ టిప్ వల్ల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారా.. ఈ వివాదంపై ఈ మూడు కంపెనీలు ఏం చెబుతున్నాయి? అసలు ఈ ‘అడ్వాన్స్ టిప్’ ఎలా మొదలైంది..? అసలేంటీ ఈ అడ్వాన్స్ టిప్… ఇప్పుడు తెలుసుకుందాం రండి..
అడ్వాన్స్ టిప్ అంటే ఏంటి..?
జనరల్ గా రైడ్ అయ్యాక డ్రైవర్ సర్వీస్ బాగుంటే టిప్ ఇస్తాం.. ఇది సర్వసాధరమే కానీ, ఈ కంపెనీలు రైడ్ బుక్ చేసేటప్పుడే టిప్ ఇవ్వమని ఆప్షన్ పెట్టాయి. టిప్ ఇస్తేనే డ్రైవర్లు రైడ్ తీసుకుంటున్నారు. లేకపోతే క్యాన్సిల్ చేస్తున్నారు. దీనివల్ల జనాలు ఇష్టం లేకపోయినా ఎక్కువ టిప్ ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఈ అడ్వాన్స్ టిప్పై కంప్లైంట్స్ రావడంతో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సీరియస్ అయింది. మే 16, 2025న ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీలకు నోటీసులు పంపి, సమాధానం కోరింది. అయినా కంపెనీలు ఈ ఆప్షన్ తీసెయ్యడానికి ఒప్పుకోలేదు. CCPA దర్యాప్తు పూర్తయితే ఓలా, ఉబర్, ర్యాపిడోకి భారీ జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అడ్వాన్స్ టిప్ ఆప్షన్ని తొలగించమని ఆర్డర్ ఇచ్చే ఛాన్సుంది.

ఈ ‘అడ్వాన్స్ టిప్’ ఎలా మొదలైంది..?
తొలుత ఈ ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి 2022లో కర్ణాటక ప్రభుత్వ మద్దతు కలిగిన ‘నమ్మ యాత్రి’ బీజం వేసింది. ఆ తర్వాత ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి ప్రముఖ క్యాబ్ సంస్థలు దీన్ని అందిపుచ్చుకొని వినియోగదారుల నుంచి వసూళ్లు మొదలుపెట్టాయి. 30 సెకన్ల వరకు ఏ డ్రైవర్ కూడా అందుబాటులోకి రాకపోతేనే ‘టిప్’ ఆప్షన్ను చూపిస్తున్నామని ర్యాపిడో పేర్కొంటున్నప్పటికీ, టిప్ ఇవ్వనిదే క్యాబ్లు ఈ మధ్యకాలంలో బుక్ కావడం లేదని వినియోగదారుల ప్రధాన వాదన.
కంపెనీలు ఏం చెబుతున్నాయి…?

క్యాబ్ కంపెనీలు మాత్రం “అడ్వాన్స్ టిప్ అనేది ప్రయాణికుల ఇష్టం… అది ఆప్షనల్ మాత్రమే. అలా అడ్వాన్స్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు” అని వాదిస్తున్నాయి. కానీ, ఈ ఆప్షన్ వల్ల కస్టమర్లపై మానసిక ఒత్తిడి పడుతోందని, ఇది హక్కుల ఉల్లంఘన కిందికు రాదా అని CCPA ఆరా తీస్తోంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ అడ్వాన్స్ టిప్ని అనైతికం, దోపిడీ అంటున్నారు. “టిప్ అనేది సర్వీస్ కి ప్రశంసగా ఇవ్వాలి. కానీ రైడ్ బుక్ చేయడానికి బలవంతంగా ఇప్పించడం అన్యాయమని అన్నారు. ఈ దర్యాప్తు తర్వాత అడ్వాన్స్ టిప్ ఆప్షన్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.
Suresh