ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. చీనాబ్ నది (Chenab River) పై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు.
ప్రపంచంలోనే అతి ఎత్తైనా రైల్వే బ్రిడ్జి…

ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ (Chenab Bridge) రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు(PM Modi Chenab Bridge Inauguration). పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) అనంతరం ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే మొదటిసారి. చీనాబ్ నదిపై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన( World’s Highest Railway Bridge India ) భారత్లో నిర్మించడం విశేషం.
రూ.43,780 కోట్ల వ్యయంతో..

మరోవైపు కాట్రా శ్రీనగర్ మధ్య కూడా రెండు వందే భారత్ రైళ్ల (Vande Bharat Train) ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రారంభంతో కాట్రా శ్రీనగర్ (Srinagar) మధ్య దూరం తగ్గనుంది. కేవలం 3 గంటల్లోనే ఈ రైలు గమ్యాన్ని చేరుకోనుంది. అలాగే భారత్లో తొలిసారిగా రూపొందించిన కేబుల్ రైల్వే బ్రిడ్జి (Cable Railway Bridge) అంజి వంతెనను కూడా మోదీ ప్రారంభించనున్నారు. రూ.43,780 కోట్ల వ్యయంతో ఉదంపూర్ శ్రీనగర్(Srinagar) భారముల్లా (Bharamulla) రైల్వే లింక్ ప్రాజెక్టు ప్రకటన కూడా ప్రధాని మోదీ చేయనున్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.350 కోట్లతో నిర్మించనున్న శ్రీమాతా వైష్ణో దేవి (Shrimata Vaishno Devi) ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు.