Srisailam in danger… is it in danger of collapsing at any moment?
  • ప్రస్తుతం డ్యాం పరిస్థితి ఏంటి…?
  • శ్రీశైలం డ్యాం తో తెలుగు రాష్ట్రాలకు ముప్పు తప్పదా..?
  • తెలుగు రాష్ట్రాల సరిహద్దులో వాటర్ బాంబు గా శ్రీశైలం డ్యాం తయారయ్యిందా..?
  • ప్రస్తుతం వచ్చే కృష్ణా నది వరదలతొ ఏ క్షణమైనా డ్యాం కూలిపోవచ్చు..?
  • శ్రీశైలం డ్యాం పునాదులు దెబ్బతిన్నాయా..?
  • శ్రీశైలం డ్యాం సేఫ్టీని ఎందుకు గాలికి వదిలేశారు..?
  • తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు శ్రీశైలం డ్యాం పై ఎందుకు మౌనం పాటిస్తున్నారు..?
  • ప్రస్తుతం ఉన్న డ్యాం డామేజ్ మరమ్మతులకు ఏం ఖర్చు అవుతుంది ..?
  • డ్యామ్ మరమ్మతుల ఖర్చు రెండు రాష్ట్రాలు వెనకడుగు వేస్తుందా…?
  • ఆ గొయ్యిని పూడ్చేది ఎప్పుడు..?
  • శ్రీశైలం డ్యామ్ ను రక్షించేది ఎవరు..?
  • జాతీయ డ్యాం భద్రత అథారిటీ డ్యాం పై ఏం చెబుతుంది..?
  • గతంలో డ్యామ్ భద్రతకు పెట్టిన స్టీల్ సిలిండర్ల సంగతేంటి..?
  • ఎందుకు ఎన్డీఎస్ఏ చైర్మన్ అసహనం వ్యక్తం చేసింది…?
  • తక్షణమే పనులు చేయకపోతే ఏం జరుగుతుంది…?
  • ప్రస్తుతం శ్రీశైలం నీటిని అడ్డుకోకపోతే… దిగువన ఉన్న నాగార్జున సాగర్ కి ఎఫెక్ట్ పడుతుందా..?
  • శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాలు ఎందుకని ముందడుగు వేయలేక పోతున్నారు..?

అసలు శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) లో ఏం జరుగుతుంది. నిజంగా శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందా..? 15 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదపు ప్రభావమే ఇప్పుడు ఎదురవుతుందా అంటే… అవుననే సమాధానం వినిపిస్తుంది. రోజురోజుకు శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్ ( Danger Zone) లోకి వెళ్తుంది. అవును నిజంగా.. తెలుగు రాష్ట్రాలకు త్రాగు, సాగు నీరు, విద్యుత్ ని అందజేస్తున్న “నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు” (Srisailam Project) ప్రస్తుతం ప్రమాదపు అంచులో కొట్టుమిట్టాడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న విషయం ప్రభుత్వాలు తెలిసిన, ప్రాజెక్టుపై మాత్రం జాప్యం చేస్తున్నాయి. అయితే 15 సంవత్సరాల కిందట జరిగిన ప్రమాదమే… ఇప్పుడు మరింత ముప్పుగా మారింది.

కృష్ణా నది వరదలే ఇంతటి ప్రమాదానికి కారణం..?

ఇక శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన 1963 జూలైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) చేతుల మీదుగా జరిగింది. 1964లో రూ.39.97 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా 1991 నాటికి రూ.567.27 కోట్లయింది. కాగా డ్యాం నిర్మాణంలోనే… అంటే 1975-76లో ప్రాజెక్టు స్పిల్ వే దిగువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే ప్రాంతం కోతకు గురై భారీ గుంత ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమటీ సూచన మేరకు ఎప్రాన్ ను నిర్మించినా ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984-85లో ఎప్రాన్ కు రక్షణగా కాంక్రీట్ సిలిండర్లతో కటాప్ వేశారు. ఇక చివరకు డ్యాము నిర్మాణం క్రెస్టుగేట్లతో సహా 1984 డిసెంబరు నాటికి పూర్తయింది. 1985 వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది. 2009 అక్టోబరు 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చింది. ఆ భారీ వరదనీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటిమట్టం కంటే 10 అడుగుల పై నుంచి నీరు ప్రవహించింది. దీంతో అప్పట్లో కృష్ణనది (Krishna River) లో దేశంతోనే అతి భయంకరమైన వరదలుగా రికార్డుకెక్కాయి. అప్పుడే డ్యామ్ దిగువ భాగంలో వాటర్ ఫ్రోర్డ్స్ కి భారీ గొయ్యి ఎర్పడింది. అప్పటి గొయ్యే… ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది.

శ్రీశైలం ప్రాజెక్టులో స్పిల్‌ వే వద్ద జరిగింది..?

నిజానికి ప్రస్తుతం ఉన్న ఈ ప్రమాదం చాలా పెద్దది అని చెప్పాలి. శ్రీశైలం ప్రాజెక్టులో స్పిల్‌ వే వద్ద ఏర్పడిన ప్లంజ్‌ పూల్‌ ఏప్రాన్‌ కన్నా దిగువకు విస్తరించింది. ప్రాజెక్టు స్పిల్‌ వేకు సమాంతరంగా కొద్ది దూరంలో పునాది కన్నా దిగువన భారీ గొయ్యి ఏర్పడింది. ఇక ఈ కోతను నివారించేందుకు గతంలో ఏర్పాటు చేసిన స్టీలు సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌తో కూడిన నిపుణుల బృందం ఇటీవల ప్రాజెక్టును సందర్శించి తక్షణం చేపట్టాల్సిన పనులపై సిఫారసులు చేసింది. ఇక ఈ శ్రీశైలం ప్రాజెక్టులో భద్రతా పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకూ కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పనులు జగన్‌ సర్కారు హయాం నుంచి ఆలస్యమవుతూ ఉన్నాయి. 2022 లో ఒకసారి, 2024లో ఒకసారి జాతీయ డ్యాం భద్రత అథారిటీ ఈ ప్రాజెక్టును సందర్శించి, పలు సిఫారసులు చేసింది. వాటి ఆధారంగా చేపట్టాల్సిన పనుల్లో అడుగు ముందుకు పడటం లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు పరిస్థితిపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీకి ఫిర్యాదు చేయడం, అథారిటీ ఛైర్మన్‌ను రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ కోరడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక శ్రీశైలంలో ఏప్రాన్‌ 169 మీటర్ల వద్ద ఉంటే ప్లంజ్‌ పూల్‌ 122 మీటర్ల వరకు ఉంది. అంటే ఏప్రాన్‌ కన్నా లోతుకు దాని సమాంతరంగా ఈ గొయ్యి ఏర్పడింది. అది విస్తరిస్తూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో అత్యంత లోతైన ఫౌండేషన్‌ తొమ్మిదో బ్లాకులో 134 మీటర్ల వద్ద ఉంది. ప్రస్తుతం ప్లంజ్‌ పూల్‌ దాని కన్నా 12 మీటర్ల లోతులో ఉందని అధికారులు గుర్తించారు.

NDSA బృందం.. ఏం చెప్పింది.

గతంలో శ్రీశైలం డ్యాం లో భారీ గొయ్యి గుర్తించిన NDSA బృందం.. డ్యాం సెఫ్టికి 12 సిలిండర్ లను తాత్కాలికంగా అమర్చారు. కాగా ప్రస్తుతం ఆ 12 సిలిండర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే మరో వైపు స్పిల్‌ వే దిగువన కుడి, ఎడమ కొండ గట్లు సైతం జారిపోతున్నాయి. ఈ కొండల వాలుకు క్రీటింగు చేయాల్సి ఉంది. డ్రిప్‌ కింద 200 కోట్ల రూపాయల అంచనాతో తొలి విడత పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినా ముందడుగు పడటం లేదు.ఇదిలా ఉంటే… నిజంగా శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని సాగు నీటిరంగ నిపుణులు, అధికారవర్గాలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్లంజ్పూల్ (భారీ గొయ్యి) స్పిల్ వైపు విస్తరించకుండా ఏప్రాన్కు చివరన వేసిన 12 కాంక్రీట్ సిలిండర్లు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. దీంతో ప్రాజెక్టు మరమ్మతులకు డ్రిప్‌ పథకాన్ని వినియోగించుకోవాలా, లేదా అనే విషయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఎటూ తేల్చడం లేదు. 2024లో 14.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా అందులో 2 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. ఇక ప్రస్తుతం వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్ వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు రూ.25 కోట్లు.. కుడి వైపు, ఎడమ వైపు కొండవాలు జారకుండా షార్ట్ క్రీటింగ్ చేయడానికి రూ.5.90 కోట్లు వెరసి రూ.31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూల్ సీఈని ఆదేశించడం గమనార్హం. అది కూడా వరద ఉద్ధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించారు. కాగా డ్యాం సేఫ్టీ కీలక పనులకు ఇంకా నిధులు అవసరం.

శ్రీశైలం డేంజర్ జోన్ లో ఉన్నట్లేనా..?

ప్రస్తుతం శ్రీశైలం వద్ద ఉన్న ఈ భారీ ముప్పును శాశ్వతంగా పరిష్కరించడం ప్రస్తుతం అయ్యే పని అయితే కాదు. కానీ రేపు వచ్చే వరదను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా అయినా ప్రాజెక్టుకు మరమ్మతులు చేయ్యాలి. ఇక ఇలాగే ప్రాజెక్టు నడుస్తుంది కదా అని.. ఇంకా జాప్యం చేస్తే మాత్రం.. పూర్తిగా శ్రీశైలం డ్యామే కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఇలాగే పరిస్థితి కొనసాగితే… డ్యామ్ పగిలిపోయే ప్రమాదం మాత్రం తెలుగు రాష్ట్రాలే కాదు దేశం కూడా అంచనా వేయలేవు. నిజానికి కానీ అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే ఇప్పటి నుంచే డ్యాం భద్రతపై ఇటు రెండు రాష్ట్రాలు అటూ కేంద్ర ప్రభుత్వం సైతం డ్యాం పై ఫుల్ ఫోకస్ పెట్టి శ్రీశైలం డ్యాం ను కాపాడుకోవాలి. లేదంటే భారీ ముప్పు తప్పదని మాట అందుకు గుర్తించుకోవాలి.

Suresh

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *