మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ ఖలేజా. థియేటర్ల వద్ద అనుకున్న అంచనాలు అందుకోలేకపోయిన ఈ సినిమా తర్వాత టీవీలో మాత్రం మంచి టాక్ ను తెచ్చుకోవడంతో పాటూ ఆ తర్వాత అందరికీ ఈ సినిమా ఓ ఎమోషన్ లాగా మారిపోయింది. ఖలేజా సినిమాకు మహేష్ ఫ్యాన్స్ తో పాటూ ఇతర ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అందరిలోనూ ఈ సినిమాకూ యునానిమస్ పాజిటివ్ రీచ్ ఉంది. ఇప్పుడదే ఈ సినిమాకు మంచి ప్లస్ గా మారింది. ఖలేజా రిలీజైన ఇన్నేళ్లకు రీరిలీజ్ అవుతుంటే ఈ సినిమా బుకింగ్స్ మొదలైన ఫస్ట్ డే నుంచే సాలిడ్ నెంబర్లను నోట్ చేసింది. రిలీజ్ కు మరో రెండ్రోజుల టైమ్ ఉండగానే ఖలేజా అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా రూ.4 కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి కొత్త రికార్డును అందుకుంది.
ఈ రికార్డులను చూశాక రీరిలీజుల్లో ఖలేజా డే1 భారీగా వసూలు చేయడం ఖాయమని అర్థమవుతుంది. అనుష్క శెట్టిహీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా, ఇప్పటికీ ఖలేజా సాంగ్స్ కు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. అందుకే మహేష్ ఫ్యాన్స్ కు ఖలేజా మూవీ సంథింగ్ స్పెషల్ మూవీ.