If Sardar Nehru had said this in 1947, this would not have happened now.

ప్రస్తుతం భారత దేశం ఇలా ఉంది అంటే… అప్పుడు దేశం కోసం పోరాటం చేసిన యోధుల కృషే అనే చెప్పాలి. ఇదే విషయాన్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశం ఇలా ఎందుకు ఉంది అంటే… అది కూడా అప్పుడు వాళ్లు చేసిన తప్పిదాలే అని చెప్పాలి. అవును… ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశం కోసం కల్మషం లేని పోరాటం చేసిన యోధులు నూటికో.. కోటికో ఒక్కరు ఉంటారు. అందులో ఖచ్చితంగా స్వతంత్ర సమరయోధుడు భారత పూర్వ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు.

ప్రస్తుతం భారత దేశంపై జరుగుతున్న ఉగ్రవాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశం ఈ సమ్యతో భాదాపడుతుంది అంటే… 1947 లో వాళ్ల పనికి మన వాళ్లు అడ్డుపడటమే ఇందుకు కారణం అని తేల్చి చెప్పేశారు. నిజానికి మోదీ ఈ మాట అనడంలో ఎటువంటి అనుమానం లేదు. 1947 దేశ విభజన జరిగిన రోజుల్లోనే ఉగ్రవాద దాడిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోని ఉంటే.. ఇప్పుటికీ భారత్ ఈ ఉగ్రవాద తో పోరాడాల్సి పరిస్థితి ఉండేది కాదు.

ప్రస్తుతం భారత్ వికృతరూపాన్ని అనుభవిస్తోందని గుజరాత్లో జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అప్పటి హోంమంత్రి, పూర్వ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు. “1947లో భారత్ మూడు ముక్కలైంది. అదే రాత్రి గడ్డపై మొదటి కాశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ఇండియాలోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ‘ముజాహిదీన్’ పేరుతో బలవంతంగా ఆక్రమించింది. ఆ రోజే, ముజాహిదీన్లు అని పిలవబడే వారిని మృత్యు కూపంలో పడవేసి ఉండాల్సింది” అని మోడీ అన్నారు. అప్పుడే… POK ని తీసుకునే వరకు బారత సైన్యం ఆగకూడదని పటేల్ కోరుకున్నారు. కానీ నెహ్రు.. సర్దార్ సాహిబ్ మాటలు పట్టించుకోలేదు” అని చెప్పారు. ఈ ముజాహిదీన్ల రక్తపాతం గత75 ఏళ్లుగా కొనసాగుతోందని, పహల్గామ్ లో జరిగింది దీని రూపమే అని, భారత సైన్యం ప్రతీసారి పాకిస్తాన్ని ఓడించింది. ప్రస్తుతం భారత్ పై గెలవలేమనే పాకిస్తాన్ కు అర్థమైందని మోడీ అన్నారు.

గుజరాత్‌లో ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పాక్ ఒక యుద్ధ వ్యూహంగా అనుసరిస్తోందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. దీన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కుంటోందన్నారు. పాక్‌లో ఉగ్రవాదుల అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేశారని చెప్పారు. అలాగే సర్కారు అధికారులు సైతం పాల్గొని ఉగ్రవాదులకు నివాళులు అర్పించారని తెలిపారు. ఆ దేశ ఆర్మీ సైతం ముష్కరుల మృతదేహాలకు సెల్యూట్ చేసిందన్నారు. అంతటితో ఆగకుండా… లష్కరే తోయిబాకు కుటుంబానికి పాక్ ప్రభుత్వం నష్టపరిహారం కింద 14 కోట్లు సైతం ప్రకటించింది ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదం అనేది పరోక్ష యుద్ధం కాదని.. పాకిస్థాన్ యుద్ధం వ్యూహం అని ఇది రుజువు చేస్తోందన్నారు. అందుకు తగ్గట్లుగానే మేము కూడా స్పందిస్తామని మోదీ వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *